టాలీవుడ్ స్టార్
ప్రొడ్యూసర్ సురేష్ బాబు సోషల్ మీడియాలో ట్రోల్ కి గురి అవుతున్నాడు. ఆయన నిర్మించిన చిత్రం నారప్ప థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల చేయడంతో ఇప్పుడు ఆయనపై తెగ విమర్శలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే.
సినిమా నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయాలనే భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఇప్పుడు
సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం మొదలు పెట్టడంతో వారు మెల్లగా ఊపిరిపీల్చుకున్నారు.
రెండవ దశ
కరోనా ముగింపు సమయంలో
టాలీవుడ్ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తమ సినిమాలను విడుదల చేసికోవాలా లేదా ఓటీటీ లకు అమ్ముకోవాలా లేదా సినిమాలు మానేయాలా అనే పరిస్థితుల్లో ఉన్నారు మన నిర్మాతలు. ఇలాంటి పరిస్థితులలో
టాలీవుడ్ లో బాగా అనుభవం ఉన్న
నిర్మాత , ఎన్నో పెద్ద సినిమాలను నిర్మించిన
ప్రొడ్యూసర్, వందలకొద్దీ సినిమాలను నిర్మించిన
సురేష్ బాబు సైతం వెనక్కి తగ్గి తన సినిమాను ఓ టీ టీ లో విడుదల చేశాడు. దాంతో అందరూ
సురేష్ బాబు లాంటి వాడే ఒత్తిడికి తట్టుకోలేక తన సినిమాను ఓ టీ టీ విడుదల చేశాడు.
మనం ఎంత అని చిన్న నిర్మాతలు సైతం ఆ విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే ఎవరూ చేయని ధైర్య సాహసాలు కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు చేయడంతో
సినిమా పరిశ్రమ ఇప్పుడు గట్టెక్కింది. తెలుగు ప్రేక్షకులు సినిమాలను థియేటర్లలో చూడడానికి మెల్లగా కదిలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో
సురేష్ బాబు చేసిన పని ఏమాత్రం సరికాదని నరప్ప ను
సినిమా థియేటర్లలో అప్పుడే విడుదల చేసి ఉంటే పరిస్థితి ఇప్పుడు వేరే లా ఉండేది. వేరే స్టేజ్ కి వచ్చేది అని అంటున్నారు. మరి దీని గురించి
సురేష్ బాబు ఏమని స్పందిస్తాడో చూడాలి