దేశంలో కరోన వైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 63 వేలకు చేరువలో ఉన్నాయి. గత పది రోజుల్లో దాదాపు 40 వేల కేసులు దేశంలో నమోదు అయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడు చాలా అధికంగా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ లో తీవ్రత చాలా అధికంగా ఉంది. 

 

ఇక ఇప్పుడు కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చైనాకు కార్గో సర్వీసులను నడుపుతున్న 5 మంది ఎయిర్ ఇండియా పైలెట్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో వారిని ఐసోలేషన్ కి తరలించారు అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన లో మీడియా కు వివరించింది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: