ట్విట్టర్ వేదికగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ జీవిత సత్యాలను చెప్తూ ఉంటారు. తాజాగా ఆయన విజయం సాధించిన సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేసారు. దీనిలో ఆయన విలువైన సూచనలు చేసారు. గెలిచినప్పుడు నిగర్వంగా ఉండాలన్నారు. 

 

ఓడినప్పుడు వినయంగా ఉండాలని చెప్పుకొచ్చారు.  మనలోనే దైవమున్నాడని కొందరు కన్ను మూసేవరకు కన్ను తెరిచి చూడలేరన్న ఆయన... అలా అని దేవుడి మీదే భారం వెయ్యకుండా గాలిలో దీపం పెట్టి గంగానమ్మా నీ మహిమ అని ఊరుకోకుండా మానవ ప్రయత్నం కూడా చెయ్యాలి సన్నిహితులారా అంటూ పోస్ట్ చేసారు. దీనికి మంచి స్పందన వస్తుంది సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: