విజయవాడలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చేసుకున్నా సరే బెజవాడలో మాత్రం కరోనా కట్టడి అయ్యే అవకాశాలు మాత్రం దాదాపుగా లేవు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే విజయవాడలో తాజాగా కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. 

 

ఒకే భవనం లో 12 మందికి కరోనా వచ్చింది అని అధికారులు ప్రకటించారు.  మొగల్ రాజపురం మాలక్ష్మీ కాంప్లెక్స్ లో పని చేసే 12మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. భవనంలో పని చేసే సిబ్బంది, హౌస్ కీపింగ్ ఉద్యోగులకు కోవిడ్ సోకిందని పేర్కొన్నారు అధికారులు. కాంప్లెక్స్ లో మారుతి కార్ షో రూమ్ తో పాటు,  కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ,  యూనియన్ బ్యాంక్ ఇతర వాణిజ్య సంస్థల కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అని భవనం మొత్తాన్ని మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: