ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాలపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు చేసారు. పేదల ఇళ్ల స్థలాల్లో కుంభకోణాలకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చారని  ఆయన ఆరోపించారు. ఎక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేసి ఎమ్మెల్యేలు కోట్లు దోచుకుంటున్నారన్నరని ఆయన మండిపడ్డారు. 

 

ఎమ్మెల్యేల దోపిడీపై సీబీఐ విచారణ చేస్తే అన్నీ బయట పడతాయని ఆయన పేర్కొన్నారు. చేపల చెరువు వద్ద కొంగను కాపలా పెట్టినట్టు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి పరిస్థితి ఉందని మండిపడ్డారు.  ఆయన భూమిని ఇచ్చి నాలుగు కోట్ల రూపాయలు అదనంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఈ సందర్భాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: