విశాఖ ఫార్మా కంపెనీ సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై లోకేష్ సంతాపం వ్యక్తం చేసారు. 

 

మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసారు లోకేష్. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఘటన పై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.  అక్కడ ఉన్న ప్రజలు కొందరు పరుగులు తీసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: