కరోనా నిర్వహణ విషయంలో మనం ఇంకా పోరాటం చేస్తున్నామని, కేసులు తగ్గాయి కాబట్టి కరోనా తగ్గింది అని అనుకోవడం అసలు మంచిది కాదు అని ఆయన హెచ్చరించారు. మన దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని చెప్పారు. మాస్క్ లు లేకుండా చాలా మంది బయట తిరుగుతున్నారు అని,  కరోనాను తక్కువగా చూడవద్దు అని ఆయన హెచ్చరించారు.

 మాస్క్ లేకుండా బయటకు వస్తే మిమ్మల్ని మీ ఫ్యామిలీ ని రిస్క్ లో పెట్టుకున్నట్టే అని మోడీ ఈ సందర్భంగా హెచ్చరించారు. కరోనాపై విజయం సాధిస్తున్నాం కాబట్టి అలసత్వం వద్దని ఆయన పేర్కొన్నారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి అని ఆయన సూచించారు. కరోనా వ్యాప్తిని మనం సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఆయన చెప్పారు. మాస్క్ ల విషయంలో అసలు ఎంత మాత్రం లైట్ తీసుకోవద్దు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: