కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​. ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో దళిత యువతి హత్యాచార ఘటనపై స్పందించిన ఆ పార్టీ నేతలు.. పంజాబ్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. హాథ్రస్​ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఏమైపోయారని నిలదీశారు.


అత్యాచార ఘటనలను రాజకీయం చేయడం తగదని నొక్కి చెప్పారు నిర్మల. హాథ్రస్​ ఘటన అనంతరం బాధితురాలి కుటుంబాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పరామర్శించిన రాహుల్, ప్రియాంక.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్​, రాజస్థాన్​లో అలాంటి ఘటనలు జరిగితే ఎందుకు వెళ్లడం లేదన్నారు.ఆర్జేడీ నేత, బిహార్​లో మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​పైనా సీతారామన్ విమర్శలు గుప్పించారు. బిహార్ వలస కార్మిక కుటుంబానికి అన్యాయం జరిగితే స్పందించరా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: