దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇప్పుడు విజయం కోసం అధికార విపక్షాలు చాలా కష్టపడుతున్నాయి. రాజకీయంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఎప్పుడు ఏ ఘటన జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా మంత్రి హరీష్ రావు టార్గెట్ గా బిజెపి  నేత డీకే అరుణ తీవ్ర విమర్శలు చేసారు. హరీష్ రావు ఏడుపులు పని చేయవు.

హరీష్ వి నీచ రాజకీయాలు అని ఆమె ఆరోపించారు. నీ సిద్దిపేట ఎలా ఉంది.. దుబ్బాక ఎలా ఉంది అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకలో టీఆరెస్ ఓటమి ఖాయం అన్నారు. గెలుపు కోసం గులాబీ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది అని ఆయన విమర్శించారు. బీజేపీ మీద అబద్ధాలు చెప్తే ఓట్లు వస్తాయా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్తున్నందుకు హరీష్ కు  డాక్టరేట్ ఇవ్వాలి అని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: