గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు బిజెపి నేతలు దూకుడుగా వెళ్తున్నారు. తెరాస పార్టీని ఎదుర్కొనే విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ లోకేష్ కుమార్ ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. ఇక ఫ్లెక్సీల వివాదం కాస్త తలనొప్పి గా మారింది. తెరాస కు అనుమతులు ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు అని ఇతర పార్టీల నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారు.

ఇక తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు చేసారు. కెబిఆర్ పార్కు సమీపంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేసి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఎంపీ అరవింద్ కుమార్ తో పాటు గా కార్యకర్తలు పై కేసు నమోదు చేసారు బంజారాహిల్స్ పోలీసులు. టిఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: