కాపు ఉద్య‌మ నేత, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేడు విజ‌య‌వాడ కోర్టుకు హాజ‌రు కానున్నారు. 2016లో ఆయ‌న కాపు ఉద్య‌మం ప్రారంభించిన‌ప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లా తునిలో కొంద‌రు ఆందోళ‌న కారులు ఏకంగా రైలునే ద‌గ్ధం చేశారు. ఈ కేసులో ఆయ‌న కూడా నిందితులుగా ఉన్నారు. ముద్ర‌గ‌డ‌తో పాటు మ‌రి కొంద‌రిపై కేసులు న‌మోదు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం తుని కేసులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినా, రైల్వే శాఖ మాత్రం కేసును కొనసాగిస్తుంది. దీంతో ముద్రగడ పద్మనాభం ఈరోజు విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: