గత కొన్ని రోజులుగా తెలంగాణాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాలంలో ప్రజల్లోకి వెళ్ళే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ములుగు సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ మతతత్వ పార్టీయే అని, నేను మతతత్వ వాదినే అని ఆయన స్పష్టం చేసారు. 80శాతం హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే మేం చేసేది ఏంలేదు అని ఆయన అన్నారు.

ఒక వర్గానికి కొమ్మకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దు అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉంది అని బండి వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు బయటకు పోతారో తెలియదు అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగని కేసీఆర్ కు ఓటెందుకు వేయాలి  అని నిలదీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: