తిరుప‌తి ఉప ఎన్నిక సాక్షిగా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వెల‌గ‌ల‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. పోలింగ్ స‌ర‌ళి ప‌రిశీలించేందుకు వెళ్లిన ఆయ‌న్ను బురదగాలి కొత్తపాళెంలో ఓటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో వెళ్లిన వైసీపీ నాయకుడికి దేహశుద్ధి చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రెండేళ్లుగా తమ సమస్యలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టమూరు మండలం బురదగాలి కొత్త పాళెం పంచాయతీలో సుమారు 2,000మంది ఓటర్లు ఉన్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రోడ్లు, తాగునీటి, ఇత‌ర స‌మ‌స్య‌లు తీరుస్తామ‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచాక ఈ గ్రామం వైపే చూడ‌లేదు.. ఆ స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయి. అయితే గ్రామ‌స్తులు ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఎవ్వరు సమస్యలను గుర్తించలేదని ఎంపీ ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ బురద గాలి కొత్త పాళెం వెళ్లి ఓటర్ల‌కు సర్ది చెప్పినా వినలేదు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ద్వారా సర్ది చెప్పిన ఓటర్లు వినలేదు. చివ‌ర‌కు అక్క‌డ వారికి స‌ర్దిచెప్ప‌బోయిన వైసీపీ నాయ‌కుడికి దేహ‌శుద్ధి చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: