దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారు లపై కేసు నమోదు అయింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో వీరిపై సోమ శేఖర రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి బాగా లేని సమయంలో గుంటూరుకు చెందిన సోమేశ్వరరావు వద్ద దాసరి కుమారులు 2.10 కోట్లు అప్పు తీసుకున్నారట. అయితే ఆ డబ్బులో సగం దాసరి మరణానంతరం చెల్లించాలని అడిగినప్పటికీ దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఇవ్వలేదట. దాంతో సోమ శేఖర రావు వెళ్లి డబ్బు అడగగా చంపేస్తామంటూ ఆయన్ను బెదిరించార‌ట‌.. దాంతో తాజాగా దాసరి కుమారుల‌పై సోమేశ్వరరావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉండ‌గా దాసరి నారాయణరావు ఇద్దరు కుమారులు గతంలో ఆస్తి విషయంలో పోలీస్ స్టేషన్ లో ఒక‌రొపై మ‌రొక‌రు కేసులు పెట్టుకున్న‌ సంగతి తెలిసిందే. ఈ విషయమై వీరిద్దరూ తీవ్రంగా గొడవ పెట్టుకున్నారు. దాంతో అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అంతే కాకుండా సినీ పెద్దలు ఈ వ్యవహారంలో కలగజేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు మరో సారి దాసరి కుమారుల పై కేసు నమోదు అవడం సినీ పరిశ్రమలో లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: