ముంబైలో జరిగిన రైతుల మహాపంచాయత్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తన ఆలోచన ధోరణి మార్చుకోవాలని, రైతులను తీవ్రవాదులుగా అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే రైతులపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని కూడా సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ దమనకాండను దాదాపు సంవత్సర కాలం నుంచి రైతులు భరిస్తూనే ఉన్నారని.. ఇప్పటికైనా తన ఆలోచనా ధోరణి మార్చుకుని కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేసారు. జనవరి 26వ తేదీన 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ ఉంటుందని టికాయత్ వెల్లడించారు. గతేడాది నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం విధితమే.
ముంబైలో జరిగిన రైతుల మహాపంచాయత్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తన ఆలోచన ధోరణి మార్చుకోవాలని, రైతులను తీవ్రవాదులుగా అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే రైతులపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని కూడా సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ దమనకాండను దాదాపు సంవత్సర కాలం నుంచి రైతులు భరిస్తూనే ఉన్నారని.. ఇప్పటికైనా తన ఆలోచనా ధోరణి మార్చుకుని కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేసారు. జనవరి 26వ తేదీన 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ ఉంటుందని టికాయత్ వెల్లడించారు. గతేడాది నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం విధితమే.