ఏపీలో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. బెంగళూరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం బట్టబయలైంది. కరోనా వైరస్ కట్టడి కొనసాగుతున్న లాక్డౌన్ కాలంలో ఎవరికీ అనుమానం రాకుండా దందా కొనసాగించవచ్చునని అనుకున్నారు. కానీ.. దందా నిర్వాహకులు అనుకున్నది బెడిసికొట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నగర శివారు తిమ్మాపురం గ్రామ పంచాయతీ అవంతి నగర్లోని ఓ అద్దె ఇంట్లో సాగుతున్న వ్యభిచార దందా బట్టబయలు కావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు వెల్లడించారు. దుర్గాడకు చెందిన కొటికలపూడి రాజు, చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి ఇందిరా ప్రియదర్శిని కలిసి ఫ్యామిలీ పేరుతో అవంతి నగర్లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన అప్పాజీ, బెంగళూరుకు చెందిన ఏజెంట్ రాజేశ్ ద్వారా అమ్మాయిలను రప్పించి వ్యభిచార దందా సాగిస్తున్నారు.
లాక్డౌన్కు ముందే బెంగళూరు నుంచి రప్పించిన ఇద్దరు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని కాకినాడ చుట్టుపక్కల వ్యక్తులను ఫోన్ల ద్వారా రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇక ఆ ఇద్దరు బెంగళూరు అమ్మాయిలకు పోలీసులు విముక్తి కల్పించారు. నిందితుల్లో ఏజెంట్ రాజేశ్, కొటికలపూడి రాజు, ప్రియదర్శిని, గుర్తేడుకు చెందిన సతీశ్, కొత్తపల్లికి చెందిన అప్పాజీ, కరపకు చెందిన పెంకే శ్రీనుబాబు, విటులు పంపన రాముడు, దబరిక సూరిబాబు ఉన్నారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు రాజేశ్ పాటు సతీశ్, అప్పాజీ పరారీలో ఉన్నారు.
అరెస్టు అయిన వారిని కోర్టులో హాజరు పర్చారు. ఇక బెంగళూరుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాధితులుగా గుర్తించి నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. వారి ఉత్తర్వుల ప్రకారం ఆ అమ్మాయిలను ప్రొటెక్షన్ హోమ్కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు