పది సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరసగా 7 సినిమాలు ఫెయిల్ అయిపోయినా ఆ తరువాత విజయాలను అందుకుని ఎన్నో ఎత్తుపల్లాలను తన కెరియర్ లో చూసి ఇప్పుడు ‘జ్యోతిలక్ష్మి’ గా ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఛార్మీ తాను నిర్మాతగా మారిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాను చాల వ్యూహాత్మకంగా ప్రమోట్ చేసుకుంటూ అనేక మార్గాలలో మీడియాను ఉపయోగించుకుంటోంది.

ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛార్మీ తన పెళ్ళి గురించి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. పెళ్ళి అనే పదం తనకు చాల బోర్ అని అంటూ దీనికి కారణం స్వతహాగా తనకు కొంచెం పిచ్చి అని ఆ పిచ్చిని తన తల్లితండ్రులు తట్టుకుంటారు కాని పెళ్ళి చేసుకుంటే బయట నుంచి వచ్చిన వ్యక్తి తన భర్త అయినా భరించడు కదా అంటూ సెటైర్లు వేసింది ఛార్మీ.

‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో హీరోయిజమ్ పండించే ఒక హీరోయిన్ గా తనను చూస్తారు అంటూ ఒక సామాజిక అంశం పై ఒక మహిళగా తాను చేసే పోరాటం అందరికీ నచ్చుతుంది అంటూ కామెంట్స్ చేసింది ఛార్మీ. అంతేకాదు ఈమధ్యనే బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ 130 కోట్ల కలెక్షన్స్ రాబడితే తన ‘జ్యోతిలక్ష్మి’ మాత్రం కలెక్షన్స్ సునామి ఎందుకు సృస్టించదు అని ప్రశ్నిస్తోంది ఛార్మీ.

ఈ సినిమాలో పేరుకే తాను వేశ్య అయినా బూతు అనేది ఉండదు అంటూ రొమాంటిక్‌గా ఉంటుందిఅంటూ అర్ధంకాని కామెంట్స్ చేస్తోంది ఛార్మీ. అంతేకాదు సెకండాఫ్‌లో చీర కట్టుకొని మెసేజ్‌ ఇస్తాను అని ఛార్మీ చెపుతున్న మెసేజ్ లను నేటి యూత్ ఆదరిస్తారా? అన్న విషయం మరో రెండు రోజులలో తెలుస్తుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: