విక్టరీ వెంకటేష్ అంటేనే రీమేక్ రాజా అనే పేరు ఉంది. ఆయన సినిమాలలో ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు చేస్తే వచ్చిన విజయాలే ఉన్నాయి. ఆ విధంగా విక్టరీ వెంకటేష్ తన సినిమాల్లో ఎక్కువగా రీమేక్ సినిమాలే ఉండేలా చేసుకుంటూ సునాయాసంగా విజయలను తన ఖాతాలో వేసుకుంటు ఉంటాడు. అయితే అదే రీమేక్ సినిమాలు ఆయనకు నిరాశను కూడా తీసుకు వచ్చాయి గతంలో. ఇటీవల ఆయన హీరోగా చేసిన నారప్ప చిత్రం అలాగే దృశ్యం రెండవ భాగం సినిమా కూడా రీమేక్ లే కాగా అవి ఆయనకు భారీగా విజయాన్ని సమకూర్చాయి. 

అలాగే ఇప్పుడు ఓ సీక్వెల్ సినిమాల్లో కూడా నటిస్తూ ఆ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేసుకునే విధంగా వెంకటేష్ ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఆయన కెరీర్లో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఎఫ్ 2 చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వల్ రావాలని అప్పట్లో ప్రేక్షకులు అభిమానులు కోరగా వారి కోరిక మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఎఫ్ 3 చిత్రాన్ని మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి చేసే స్థాయికి తీసుకువచ్చాడు. ఈ చిత్రం కూడా ఆ సినిమా లాగానే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడని అంటున్నారు.

ఇకపోతే ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో మల్లగుల్లాలు పడుతున్న వెంకటేష్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అక్కడ మోహన్ లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన బ్రో డాడీ చిత్రాన్ని తెలుగులో చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన తెలుగు హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కొనుగోలు చేయగా తొందర్లోనే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సినిమా లో వెంకటేష్ తో పాటు దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. అలాగే నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఇద్దరు కలిసి మల్టీస్టారర్ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: