టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట. గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.సూపర్ స్టార్ మహేష్ బాబులో మరోసారి మాస్ యాంగిల్ చూసి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. మహేష్ బాబుకు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటించిన ఈ సినిమాను మైత్రి మూవీస్ ఇంకా మహేష్ బాబు జీ.ఎమ్.బీ బ్యానర్స్ కలిసి నిర్మించాయి. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్ ఓ మరో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డ్ స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టింది. ఇక ఈ సినిమాకు యస్ యస్ తమన్ అద్భుతమైన పాటలను అందించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 206 కోట్లు కోల్లగొట్టిన ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. అలాగే 146 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. మహేష్ బాబు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఇంకా ఆరాట పడుతున్న ‘మురారి వా ‘ పాట తాజాగా యాడ్ అయిపోంది.



అలాగే ఇప్పుడు మహేష్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది.సర్కారు వారి పాట సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకి సర్కారు వారి పాటను దక్కించుకుంది. నెల రోజుల థియేట్రికల్ రన్ తర్వాత అంటే జూన్ 10 లేదా జూన్ 24న ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని మొదట నుంచి టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే ముందుగానే ఈరోజు నుంచే ప్రైమ్ వీడియోలో మహేశ్ సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. అది పే పర్ వ్యూ రెంటల్ విధానంలో మహేష్ మూవీని అభిమానులకు అందించింది అమెజాన్ ప్రైమ్. అలాగే కొద్దిరోజులు పే పర్ వ్యూ విధానంలో ఉంచి..ఇక ఆ తర్వాత సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో ఉంచనుంది. దాంతో మహేష్ అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: