తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కల్యాణి. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత పలు చిత్రాలో క్యారెక్టర్ రోల్స్ లోనూ అలరించింది ఈమె. తాజాగా ఈ సీనియర్ నటి దర్శక నిర్మాతగా మారారు. ఇటీవలి కాలంలో అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్ గా కల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తయారవుతోంది. ఈ సినిమా ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్ ను హోలీ పండుగ సందర్భంగా సోమవారం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. చేతన్ శీను, సిద్ది, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుుగుతున్నాయి.
బాలనటిగా కెరీర్ ఆరంభించిన కల్యాణి, 1986 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. తనకున్న విస్తృతానుభవంతో ఒకవైపు నిర్మాతగా మారుతూనే మరోవైపు దర్శకత్వాన్నీ చేపట్టారు. హీరోయిన్గా ఎన్నో సినిమాలుచేసిన అనుభవంతోొ ఇప్పుడు దర్శకత్వం రంగంలోకి అడుగుపెడుతున్న కల్యాణీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Best wishes #KaveriKalyani for your directorial debut. Here is the PreLook & #TeaserGlimpse of @K2KProduction Prod No.1 https://t.co/SIL6hBxsoh
— PURIJAGAN (@purijagan) March 9, 2020
All the best @ChethanCheenu, #Shweta & team. #K2KProductions #ChethanCheenu@UrsVamsiShekar #HappyHoli pic.twitter.com/7QotRUZkTu