యాంకర్ గా తన టాలెంట్ చూపిస్తూ బుల్లితెర నుండి వెండితెర మీదకు ప్రమోట్ అయినా అనసూయ లేటెస్ట్ గా ఒక స్పెషల్ షోలో తనలోని టాలెంట్ మరింత చూపించేసింది. ఉగాది కానుకగా ఈరోజు జీ తెలుగులో బాబు గారింట్లో బుట్ట భోజనం స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఈ షోలో భాగంగా అదిరింది కమెడియన్స్ తమ స్కిట్స్ తో అలరించగా యాంకర్స్, షో జడ్జ్ లు కూడా ఈ  స్కిట్స్ లో పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో భాగంగా అనసూయ మహానటిగా నటించింది. 

 

మహానటి సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో అనసూయసినిమా థీమ్ తో ఒక స్పెషల్ షో చేసింది. మహానటి సావిత్రి అభినయం, మద్యానికి బానిస అవ్వడం, జెమిని గణేశన్ తనని మోసం చేశాడని గుర్తించడం.. చివరకు మరణించడం ఇలా సినిమాలోని అన్ని ముఖ్య సన్నివేశాలను చూపిస్తూ అనసూయ నటించి మెప్పించింది. మముఖ్యంగా మాయాబజార్ లోని అహనా పెళ్లి అంట సాంగ్ తో పాటుగా సావిత్రి మందుకి బానిస అయ్యే సీన్ బాగా చేసింది. చివరకు అనసూయ ఏడుస్తూ తలా కొట్టుకుంటూ కింద పడిపొయింది. అనసూయ ఇలా తన నట విశ్వరూపం చూపించడం తన కో యాక్టర్స్ ను సర్ ప్రయిస్ చేసింది. చాలా కష్టపడి అనసూయ మహానటిగా చేసిందని చెప్పొచ్చు. 

 

మాహానటిగా అనసూయ అలా చేయడంపై స్పందించిన నాగబాబు సావిత్రి అంటే తనకు చాలా గౌరవం ఉందని అందుకే ఆమె డౌన్ ఫాల్ చూడలేనని.. కానీ అనసూయ బాగా చేసిందని అన్నారు. యాంకర్ గా దూసుకెళ్తున్న అనసూయ రంగస్థలం రంగమ్మత్త పాత్రలో తన సత్తా చాటింది. ఆ పాత్రలో సుకుమార్ వేరే వాళ్ళని అనుకోగా చివరకు అనసూయ చేసి ఆ పాత్రకు స్పెషల్ క్రేజ్ వచ్చేలా చేసింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: