ఇటీవల గుంటూరుకు చెందిన మెగాస్టార్ అభిమాని రాజనాల నాగలక్ష్మికి శస్త్ర చికిత్స జరిగినవిషయం తెలిసిందే .ఆ శస్త్రచికిత్సకు మెగాస్టార్ చిరంజీవి తన దాతృత్వాన్ని చాటుకుని అన్నివిధాలుగా సహకారాలు అందించారు. చికిత్స అనంతరం ఆమెను ICU వార్డ్ నుండి జనరల్ వార్డుకి తరలించారు.ఈ సందర్భంగా డాక్టర్లు ఆమె ఆరోగ్యం బాగుందని తెలిపారు. ఈ సందర్బంగా ఆమెను చిరంజీవి మరియు శ్రీమతి సురేఖ గార్లు ఫోన్ ద్వారా రాజనాల నాగలక్ష్మిని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు .
అదేవిధంగా మీకు ఏమీకాదు మీకు మేమున్నాం మిమ్మల్ని అన్నివిధాలుగా ఆదుకుంటాం అని భరోసా. అయితే నాగలక్ష్మి మాత్రం ఇది కలా..నిజమా? నా నడిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వయంగా నాతో మాట్లాడటమా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.శ్రీమతి సురేఖగారూ నన్ను సొంత మనిషిలా భావించి నన్ను ఆప్యాయంగా పలకరించారు . ఈ జన్మకు ఇది చాలు అని నాగలక్ష్మి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. నేను ఎంతో అభిమానించే చిరంజీవిగారు నన్ను పలకరించినందుకు చాల సంతోషం గా ఉందని తెలియజేసారు