యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎవరని అంటే, అందరికీ టక్కున గుర్తొచే పేరు విజయ్ దేవరకొండ. సినిమాల ద్వారా మాత్రమే కాదు, తన మాటల ద్వారా ప్రేక్షకుల అటెన్షన్ ని పట్టుకునే ఈ హీరో ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

 

అయితే ప్రస్తుతం అందరు హీరోలు వెబ్ సిరీస్ లవైపు చూస్తున్న సంగతి తెలిసిందే. యువ హీరోలు ఇటు వెబ్ సిరీస్ లో నటిస్తూనే, సినిమాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. సీనియర్ హీరోలు సైతం వెబ్ సిరీస్ ల వంక చూస్తున్న టైమ్ లో విజయ్ దేవరకొండ వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నాడట. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఓటీటీకి డిమాండ్ పెరిగిన మాట వాస్తవం.

 

దాంతో ప్రతీ ఒక్కరూ ఓటీటీల వంక చూస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన ఆహా స్ట్రీమింగ్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గీత గోవిందం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు కూడా. అందువల్ల విజయ్ దేవరకొండ ఆహా కోసం వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడట. విజయ్ సొంత నిర్మాణ సంస్థ అయిన కింగ్ ఆఫ్ హిల్స్ బ్యానర్ లో దొరసాని దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ఉండనుందని అంటున్నారు.

 

దొరసాని చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినప్పటికీ, దర్శకుడికి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. దాంతో ఇప్పుడు మహేంద్రకి విజయ్ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ, ఆహా యాప్ కోసం ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: