ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... షూటింగ్ లకు మాత్రమే కాదు థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్టోబర్ 15న తెరుచుకోవాల్సిన థియేటర్లు కాస్త ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ‘దసరాకి పెద్ద సినిమాలు విడుదల చెయ్యొచ్చు కదా’ అని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ఆశిస్తున్నారు. అయితే ఆ చిత్రం షూటింగ్ పార్ట్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఈ మధ్యనే నివేదా థామస్ కు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


త్వరలో మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో పవన్ మరియు హీరోయిన్ శృతీ హాసన్ ల పై ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట.10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. దాంతో ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది.ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెడతారని తెలుస్తుంది. అయితే సినిమాని మాత్రం సంక్రాంతికే దించుతారట. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి ఉన్నప్పటికీ..
కరోనా విజృంభణ ఇంకా తగ్గని తరుణంలో ‘వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమాని ఇప్పుడు విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చెయ్యకుండా.. దసరాకి టీజర్ మాత్రం విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం. ఇక పవన్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ డైరెక్షన్ లోనూ, అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లోనూ, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనూ  సినిమాలు చేస్తున్నాడు.. ఇలాంటి ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం.. చదువుతూనే ఉండండి ఇండియా హెరాల్డ్ ఆర్టికల్స్.. అలాగే ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: