టాలీవుడ్ అగ్ర హీరోల్లో చాలామంది ఇప్పుడు సినిమాల్లో కాస్త దూకుడుగా చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఎప్పుడూ సినిమాలు చేసే విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది అనే మాట అక్షరాలా నిజం. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం లేదు. అయితే ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కథ లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అరవింద సమేత అదేవిధంగా జనతా గ్యారేజ్ సినిమాలో కథ లేకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ కారణంగా నెట్టుకొచ్చారు అని ప్రచారం జరుగుతుంది.

అంతేకాకుండా గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడినట్టుగా టాక్. లవకుశ సినిమాలో అసలు కథ లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్త పడుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కాస్త ఎక్కువగా ఫోకస్ చేసాడు. కథలో ఉన్న కొన్ని కొన్ని కోణాలు తీసేయాలని మరికొన్ని జోడించి ప్రేక్షకులకు వినోదం కూడా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనబడే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరియు అతని ఏ పాత్రలో నటిస్తాడు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అటు బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: