మహేష్ బాబు ఫ్యాన్స్ కి కొంచెం ఊరట కలిగించే వార్త బయటకు వచ్చింది. మహేష్ ఇప్పుడు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.   తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. కరోనా తాకిడి తగ్గేదాకా ఈ సినిమా షూట్ మొదలు అయ్యేలా కనిపించడం లేదు. నవంబర్ నుండి ఈ సినిమా షూట్ కి వెళ్లనుందని చెబుతున్నా దాని మీద క్లారిటీ లేదు.

అయితే ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో మొదలు కానుంది. దాదాపు 45 రోజుల పాటు అమెరికాలో షెడ్యూల్ ప్లాన్ చేశారని వినికిడి. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేశ్ రెండు లుక్స్ లో కనిపించనున్నట్టు చెబుతున్నారు. అందులో ఒకటి పోకిరి లుక్ అని అంటున్నారు. పోకిరి సినిమా అంటే మహేష్ కి చెప్పలేని అనుబంధం. ఎందుకంటే ఈ సినిమా ఆయన జీవితంలో మరిచిపోలేని హిట్ ఇచ్చింది. దీంతో మహేష్ లుక్ కోసం అభిమానులు ఇప్పుడు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆ లుక్ లో కనిపిస్తే ఈ సినిమా కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ కోసం యుఎస్ఎకు వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాల కోసం దరఖాస్తు చేసింది, కాని వారి దరఖాస్తు లు ఇంకా ప్రాసెస్ చేయబడలేదని అంటున్నారు. వీసాల ప్రాసెసింగ్ ఆలస్యం కారణంగా, సర్కారు వారీ పాటా షూట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ లోకేషన్స్ ఫైనల్ చేసేసి షూటింగ్ కోసం తగిన అనుమతులను పొందారు. అయితే, వీసా సమస్యలు సర్కారు వారి పాట టీమ్ కు తలనొప్పి కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: