సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు అభిమాని అయిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. ఇక ఇప్పటికే వరుసగా మూడు విజయాలు అందుకున్న సూపర్ స్టార్, ఈ సినిమా ద్వారా కూడా మరొక సక్సెస్ అందుకుని దూసుకెళ్లాలని చూస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ పోకిరి అనంతరం యువ దర్శకడు శేఖర్ కమ్ముల తో ఆయన ఒక సినిమా చేస్తారు అనే వార్తలు అప్పటి మీడియాలో విపరీతంగా హల్ చల్ చేసాయి.

ఆ తరువాత తాను తీసిన హ్యాపీ డేస్ సినిమాలో మహేష్ రిఫరెన్స్ సీన్ పెట్టిన శేఖర్, సూపర్ స్టార్ పై తనకు ఉన్న ఇష్టాన్ని చాటుకున్నారు. ఇకపోతే మళ్ళి ఇన్నేళ్ల తరువాత మరొక్కసారి శేఖర్ కమ్ములతో సూపర్ స్టార్ మహేష్ ఒక సినిమా చేయనున్నారు అనే వార్త ఒకటి రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఒక టాలీవుడ్ బడా నిర్మాత ఇప్పటికే ఈ సినిమా విషయమై పక్కాగా సిద్ధమయ్యారని, ఆ నిర్మాతకు మహేష్ తో మంచి అనుబంధం ఉండడంతో పాటు మరోవైపు ఈ సినిమా కోసం ఇటీవల శేఖర్ కమ్ముల చెప్పిన కథ ఎంతో అద్భుతంగా ఉండడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు.

ఇక మహేష్ కూడా కథ విన్న అనంతరం ఈ ప్రాజక్ట్ విషయమై ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారని అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది మహేష్ బాబు బర్త్ నాడు మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట అనంతరం త్రివిక్రమ్ తో సినిమాని లైన్లో పెట్టిన సూపర్ స్టార్, దాని అనంతరం శేఖర్ సినిమా చేయనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదుగాని ఒకవేళ ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ ని శేఖర్ కమ్ముల మార్క్ స్టైల్ మూవీలో చూడవచ్చు .....!!

 



మరింత సమాచారం తెలుసుకోండి: