బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాలీవుడ్‌కి వెళ్తున్నా, ఫెయిల్యూర్ ఫార్ములాని మాత్రం విడిచిపెట్టడం లేదు. స్టార్స్‌తోనే స్టార్‌ మారుతుందనే పాత పద్ధతుల్లోనే ఉండిపోయాడు. వేర్‌ ఎవర్ యు గో ఐ విల్‌ ఫాలో యు అన్నట్లు డిజాస్టర్‌ ట్రాక్‌లోనే జర్నీ చేస్తున్నాడు. మరి ఫ్లాపులొస్తున్నా బెల్లంకొండలో మార్పు ఎందుకు రావడం లేదనే సందేహాలు తలెత్తుతున్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాస్‌ హీరో అనిపించుకోవాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. 'అల్లుడు శీను' నుంచి మొదలుపెడితే 'అల్లుడు అదుర్స్‌' వరకు మాస్‌ యాక్షన్‌ స్టోరీసే చేశాడు. వీటిల్లో సమంత, పూజా హెగ్డే, కాజల్‌ లాంటి స్టార్‌ హీరోయిన్స్‌తో స్టెప్పులేశాడు. అయితే మధ్యలో కొంచెం డిఫరెంట్‌గా చేసిన 'రాక్షసుడు'  తప్ప మాస్‌ మూవీస్ అన్నింటికి నెగిటివ్‌ రిజల్ట్ వచ్చింది.

బెల్లంకొండకు మాస్‌ మూవీస్‌ కలిసిరాకపోయినా, స్టార్‌ హీరోయిన్స్‌ సక్సెస్‌ అందించకపోయినా ఈ రెండిటిని మాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రభాస్‌ మాస్‌ యాక్షన్‌ మూవీ 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాకి లస్ట్‌ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్‌గా ప్రయత్నం చేస్తున్నాడట బెల్లంకొండ.

కియారా అద్వానీకి అడల్ట్ వెబ్‌ సీరీస్‌ 'లస్ట్‌ స్టోరీస్'తో యూత్‌లో ఫుల్‌ క్రేజ్ వచ్చింది. ఇక 'కభీర్‌ సింగ్‌' హిట్‌తో కియార బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ స్టార్డమ్‌నే వాడుకోవాలనుకుంటున్నాడట బెల్లంకొండ. మరి తెలుగులో హీరోయిన్ల స్టార్డమ్‌తో సక్సెస్‌ కొట్టాలని ఫెయిల్ అయ్యాడు అల్లుడు శీను. మరి బాలీవుడ్‌లో అయినా ఈ స్ట్రాటజీ వర్కవుట్‌ అవుతుందా అనేది చూడాలి.

మొత్తానికి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ఆ పాత ఫార్ములాను మాత్రం విడిచిపెట్టడం లేదు. మిగతా హీరోలంతా మార్పుకోరుకుంటుంటే ఆయన మాత్రం మాత్రం అదే దారిలో నడుస్తున్నాడు. ఇప్పటి వరకు మాస్ యాక్షన్ స్టోరీస్ నే నమ్ముకున్న ఈ హీరో.. ఇప్పటికీ మారడం లేదు. మాస్ మూవీస్ ను నమ్ముకుంటే ఫెయిల్యూర్స్ వచ్చి పడతాయనే విషయం ఆయనకు ఇంకా తెలియనట్టుంది అనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: