ఇక ప్రస్తుతం బుట్ట బొమ్మ గా టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఫేవరేట్ గా మారిపోయింది హీరోయిన్ ప్రస్తుతం ఏ స్టార్ హీరోల సినిమాల్లో చూసిన పూజా హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అవుతుంది. ఇలా అటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు ఇప్పటికే బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో టాలీవుడ్ లోనటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కన్నడ బ్యూటీ పూజా హెగ్డే త్వరలో తన మాతృభాషలో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఎంతో మంది హీరోల సరసన సినిమా చేసినప్పటికీ తన మాతృభాష అయినా కన్నడలో సినిమా చేయలేదు. ఈ అమ్మడికి ఈ ఒక్క కోరిక మిగిలిపోయిందట. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరబోతన్నట్లు తెలుస్తోంది. దీంతో బుట్టబొమ్మ ఎగిరి గంతేస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏకకాలంలో కన్నడ తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక పూర్తిగా కన్నడ భాష నటీనటులతో సినిమాను నిర్మిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే ని తీసుకోవాలని నిర్ణయానికి వచ్చిందట చిత్ర బృందం. రాధేశ్యాం సినిమాలో నటించిన పూజా హెగ్డే ప్రభాస్ కు మంచి జోడీగా పేరుతెచ్చుకుని సలార్ లో అవకాశం దక్కినట్లు టాక్ వినిపిస్తుంది.దీంతో ప్రస్తుతం పూజా హెగ్డే కన్నడ చిత్ర పరిశ్రమలోనటించేందుకు అవకాశం రావడంతో తన కోరిక తీరినదని సంబరపడిపోతుందట.