సెలెబ్రెటీలు తమ అభిమానులను పలకరించడానికి అదేవిధంగా తమ అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి సోషల్ మీడియాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి సోషల్ మీడియాని ఒక పదునైన అస్త్రంగా వాడుకుంటున్నారు.


ఇలాంటి పరిస్థితులలో అక్కినేని వారి కోడలు సమంత అత్యుత్సాహంతో చేసిన ఒక ట్విట్ అనుకోకుండా వివాదాస్పదం కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరిగింది. అయితే ఈ ట్రోలింగ్ కు భయపడ్డ సమంత ఆ ట్విట్ ను కొన్ని గంటల తరువాత తొలిగించవలసి రావడం సోషల్ మీడియా స్టామినాను మరొకసారి రుజువు చేసింది.


సమంత నిత్యం తన అభిమానులతో టచ్‌ లో ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమా విషయాలను షేర్ చేస్తూ తెగ సందడి చేయడం ఆమె అలవాటు. ఇలాంటి సందర్భంలో ఆమె లేటెస్ట్ గా తన ఇన్‌ స్టా గ్రామ్‌ స్టోరీస్‌ లో ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి సోఫాలో పడుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. నాలుగేళ్లుగా అతడు సమంతకు ఫ్యాషన్ స్టైలిష్టుగా పని చేస్తున్నాడు. ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఆ ఫొటోను షేర్ చేసిన సమంత ‘ఐ లవ్ ‌యూ' అని కూడా క్యాప్షన్ పెట్టడంతో ఆ పోస్ట్ కొద్ది క్షణాలలో వైరల్ గా మారిపోయింది.


ఈ ఫొటోను చూసి నాగార్జున నాగచైతన్య అభిమానులు కూడ షాక్ అయ్యారు. కొందరు నెటిజన్లు అయితే ఆ ఫోటోకు స్క్రీన్ షాట్స్ తీసుకొని విపరీతంగా ట్రోల్ చేసారు. అంతేకాదు సమంత ఆ వ్యక్తికి ఎంత క్లోజ్‌ అయితే మాత్రం అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో తీసుకోవడమే కాకుండా ఆ వ్యక్తిని ‘ఐ లవ్ యూ’ అనడమేంటి అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈవిషయాలు సమంత దృష్టికి రావడంతో జరిగిన పొరపాటును గ్రహించిన సమంత ఆ ఫోటోను డిలీట్ చేసినా ఆమె పై  ట్రోలింగ్ కొనసాగుతూనే ఉండటం చూసిన వారికి సోషల్ మీడియా విషయంలో సెలెబ్రెటీ అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: