పూజా హేగ్జే.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తుంది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో పూజా టాప్ హీరోయిన్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే పూజా ఇప్పుడు తన ఇష్టమైన వాడితో ఒక ఫోటోను దిగి ఆ  ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజా హెగ్డే.. ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే ముంబై వెళ్తే అక్కడ  ఉండేలాగా  బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్‌లున్న కొత్త ఫ్లాట్‌ను రీసెంట్‌గా కొనుగోలు చేసింది. అలాగే ఈ ఫ్లాట్ కూడా  సముద్రానికి ఎదురుగా ఉంది.పూజా హెగ్డే తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన మొదటి ఫ్లాట్ ఇదే. అంతేకాదు ముంబైలో ఉన్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియర్  డిజైన్ ను పూజా హెగ్డే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసిందట.


రీసెంట్‌గా ఇందులో పూజా హెగ్గే గృహ ప్రవేశం కూడా చేసింది.. తాజాగా ఆ ఇంటిలో  తనకి  ఇష్టమైన వాడితో సేద తీరుతోంది పూజా. ఇష్టమైన వాడు అంటే బాయ్ ఫ్రెండ్ కాదండోయ్.. పూజా పెంచుకునే పెంపుడు కుక్క. ఆ కుక్కతో పూజా సేద తీరుతుంది. కుక్కతో బార్ గేనింగ్ అంటూ క్యాప్షన్ రాసుకుంది.మొత్తంగా పూజా హెగ్డే.. తనకు ఖాళీగా దొరికిన ఈ టైమ్‌ను ఎంతో చక్కగా వినియోగించుకుంటుంది.ఈ ఇయర్ పూజా హెగ్డే నటిస్తోన్న మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి  అందులో ‘ఆచార్య’ ముందుగా థియేటర్స్‌లోకి రానుంది.


ఈ సినిమాలో పూజా హెగ్డే 20 నిమిషాలు మాత్రమే కనిపించనుంది. ఈ పాత్ర కోసం పూజా హెగ్గే దాదాపు రూ. 1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఆచార్య షూటింగ్‌లో జాయిన్ అయ్యే వరకు కాస్త గ్యాప్ దొరకడంతో ముంబైలో రీసెంట్‌గా  కొన్న ఫ్లాట్‌లో రిలాక్స్ అవుతోంది..ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్’తో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ రెండు సినిమాల్లో పూజ హెగ్డే పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: