బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న తరువాత నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు సరసన వంశీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.అయితే వీరి వివాహానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో నమ్రత కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరిపించారు.

నమ్రత నిజానికి ఉత్తరాది అమ్మాయి అయిన మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత అచ్చం తెలుగింటి కోడలుగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే నమ్రత గురించి తెలియని కొన్ని ఆశక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

* నమ్రత పుట్టి పెరిగింది మహారాష్ట్రలోనే. నమ్రత అమ్మమ్మ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.నమ్రత అమ్మమ్మ ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్. అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

*నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా నటి. ఈమె తెలుగులో మోహన్ బాబుతో కలిసి బ్రహ్మ అనే సినిమాలో నటించారు.

*ఇండస్ట్రీ లోకి రాకముందు నమ్రతా మోడలింగ్ వైపు అడుగులు వేశారు. మోడల్ గా అనేక ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు.1993 లో మిస్ ఇండియా కిరీటం  దక్కించుకున్నారు.

* 1998 లో నమ్రత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నమ్రత వాస్తవ్ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా హిందీ, తమిళ,కన్నడ,తెలుగు భాషలలో కలిపి 25 సినిమాల వరకు నటించారు.

*తెలుగులో నటించిన వంశీ సినిమా ద్వారా మహేష్ బాబుతో ప్రేమలో పడిన 2005 ఫిబ్రవరి 10వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కలరు.

*మహేష్ బాబు కన్నా నమ్రత వయసులో నాలుగు సంవత్సరాలు పెద్దది. మహేష్ బాబు కన్నా ఎక్కువ వయసు ఉన్నప్పటికీ వీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు.

*పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమై కుటుంబ బాధ్యతలను నమ్రత ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: