ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులని ఎన్నో సంవత్సరాలు అలరించాడు. అలాగే నటుడిగా "నేను", "గమ్యం","శంభో శివ శంభో" సినిమాలతో ఎంతగానో మెప్పించాడు. ఇక అల్లరి నరేష్ అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు అంటూ ఉండడు.ఇక అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది' ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం నరేష్ కు మంచి విజయాన్ని అందించింది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది.


విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఇప్పటివరకూ కామెడీ హీరోగానే రాణిస్తూ వచ్చిన నరేష్.. ఈసారి కంప్లీట్ సీరియస్ రోల్ ప్లే చేసి జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు..ఇక ఈ చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే...'నాంది' చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం.ఇక 11 రోజులు పూర్తయ్యేసరికి 4.63 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. రెండో సోమవారం కూడా ఈ చిత్రం 0.20 కోట్ల షేర్ ను రాబట్టి నిర్మాతకి మంచి లాభాలని తెచ్చిపెడుతుంది...ఈ సినిమా తో నరేష్ కి మంచి హిట్ తో పాటు మంచి గుర్తింపు కూడా వచ్చింది..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: