కొంతమంది హీరోయిన్ లు చూడగానే నచ్చేస్తారు.. మరికొంతమంది చూస్తూ చూస్తూ నచ్చేస్తారు.. ఈ కోవకి చెందిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. మలయాళ సినిమాల్లో కనిపించే ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరో గా నటించిన 'అ ఆ' సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమా తో హిట్ కొట్టడమే కాకుండా ఆ పాత్ర లో నటనతో అందరిని మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ప్రేమమ్ తో హిట్ కొట్టి వెంటనే శతమానం భవతి సినిమా తో హిట్ కొట్టి టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన హీరోయిన్ గా అవతరించింది. అయితే ఈ సక్సెస్ ని ఆమె కంటిన్యూ చేయలేకపోయింది.. ఉన్నది ఒక్కటే జీవితం, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు సినిమాలతో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంది.

ఆ తర్వాత వచ్చిన రాక్షసుడు పర్వాలేదనిపించుకున్నా ఆమెకు గుర్తింపు రాలేదు.దాంతో మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ - స్క్రీన్ ప్లే అందిస్తున్న '18 పేజెస్' సినిమా  లో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.. నిఖిల్ కథానాయకుడు.ఇది కాకుండా కొన్ని తమిళ, మలయాళ చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.. ఇక సినిమాలతో నే కాకుండా ఈమధ్య సోషల్ మీడియా లో ఎఫైర్ ల తో ఈ ముద్దుగుమ్మ తెగ హల్చల్ చేస్తుంది. టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా తో ఈ మలయాళ భామ ప్రేమలో ఉందనే వార్త ఎప్పటినుంచో హల్చల్ అవుతుంది. అయితే అవన్నీ పుకారాలే అని వారు తేల్చడంతో అందరు సైలెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.  తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను స్టోరీగా పెట్టుకుంది.

అంతేకాదు, దీనికి ‘మొక్క, హృదయంతో కలిసి రాజ్‌కోట్‌కు ఎగిరిపోతున్నా' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇక, ఆమె బూమ్రాను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌ కోసం బూమ్రా గుజరాత్‌లోనే ఉన్నాడు. అయితే, అతడు నాలుగో టెస్టు ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ కూడా అదే రాష్ట్రానికి వెళ్లింది. దీంతో తన ప్రియుడిని కలిసేందుకే ఆమె అక్కడికి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఫలితంగా వీళ్లిద్దరి వ్యవహారం మరోసారి దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: