నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే "రాధేశ్యామ్ " సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”. మరియు ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఆది పురుష్ " సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే "సలార్ " షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయిన "ఉగ్రం" సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.

 అయితే "ఉగ్రం" సినిమాకు కూడా ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడం గమనార్హం. ఇక "సలార్ " పై ఇప్పటికే ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్టుగా మేకర్స్ ఆ మధ్యనే కన్ఫర్మ్ చేశారు. .అయితే అప్పటి నుంచే ఇందులో ఆమె పాత్ర పై రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె ఓ సాలిడ్ రోల్ లో చేస్తుందని ఆమెపై కూడా అదిరే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని టాక్ వచ్చింది.

కానీ లేటెస్ట్ గా శృతి చెప్పిన దాని ప్రకారం తనపై ఎలాంటి యాక్షన్ సీకెన్స్ లు లేవని జస్ట్ తన యాక్టింగ్ పార్ట్ వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. అయితే శృతిహాసన్ ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న " క్రాక్ " సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో అలరించిన సంగతి తెలిసిందే. అదే విధంగా "సలార్ "లో కూడా ఈమెపై భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని చాలా మంది ఆశించారు. కానీ అలాంటివి ఏమీ లేవని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. . 

మరింత సమాచారం తెలుసుకోండి: