తొలిసారిగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొని పూజ హెగ్డే కి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ఆమె నటించిన ముకుంద సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం అల్లు అర్జున్ తో డీజే సినిమా చేసింది పూజా. అయితే ఆ సినిమా ఎబోవ్ విజయాన్ని అందుకుంది.

ఇక ఆ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత మూవీ తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని కెరీర్ పరంగా మంచి బ్రేక్ అందుకున్న పూజా ఆపై మహేష్ బాబుతో మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ అలానే అల్లుఅర్జున్ తో అలవైకుంఠపురములో వంటి వరుస విజయాలు అందుకుని ప్రస్తుతం టాలీవుడ్లో సక్సెస్ఫుల్ నటిగా మంచి క్రేజ్, పాపులారిటీతో దూసుకెళ్తోంది. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తోంది. అలాగే వీటితో పాటు మెగాస్టార్, కాజల్ అగర్వాల్ కలయికలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో కూడా ఒక కీలక పాత్ర చేస్తోంది పూజ హెగ్డే.

అందులో ఆమె రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా పూజా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు యూనిట్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ సినిమాలో పూజాహెగ్డే పాత్ర పేరు నీలాంబరి అని ఆమె ఒక గిరిజన యువతిగా సినిమాలో కనిపించనుందని మొత్తంగా సినిమాలో ఆమె స్క్రీన్ టైం 20 నిమిషాలు మాత్రమే అయినప్పటికీ కూడా ఆమె క్యారెక్టర్ ఆడియన్స్ కి ఎంతో గుర్తుండిపోతుందని చెపుతున్నారు. మరి ఈ సినిమా పూజా హెగ్డే కి ఎంత మేర గుర్తింపు తీసుకు వస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: