కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలన్నీ షూటింగ్ దశలో నిలిచిపోయాయి. వైరస్ విజృంభన తో చిన్న నుండి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాలకు దాదాపు బ్రేక్ పడింది. అయితే కొన్ని చిత్రాలను మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫినిష్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల కావాల్సి కరోనా కారణంగా బ్రేక్ పడిన సినిమాల్లో "ఆచార్య" సినిమా కూడా ఒకటి. మెగాస్టార్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా బ్రేక్ పడింది. అయితే తిరిగి షూటింగ్ ను ప్రారంభించగా మే 13న సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ మహమ్మారి విజృంభనతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో షూటింగ్ ఎక్కడి వరకు వచ్చినా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆచార్య సినిమా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారట. అయితే కొన్ని ప్యాచ్ వర్క్ లు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయట. అంతే కాకుండా అవి కూడా మెగాస్టార్    చిరు కు సంబంధించన సీన్లేనట. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే 15 రోజుల్లో మిగిలిన పార్ట్ ను పూర్తి చేస్తారు. దాంతో థియేటర్ లు రీఓపెన్ అవ్వగానే సినిమా విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచుస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు మెగాస్టార్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ కేవలం 5 లేదా 10 నిమిషాలు మాత్రమే. కానీ ఈ చిత్రంలో చరణ్ తండ్రి తో కలిసి దాదాపు అరగంట పాటు కనిపించబోతున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: