బెల్లంకొండ సురేష్ వారసుడిగా వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా కుదురుకోనప్పటికీ ఏదొక సినిమా చేస్తూ క్రేజ్ మాత్రం సంపాదించుకుంటున్నాడు.. తొలి సినిమా నుంచి ఏదోకటి కొత్తగా ట్రై చేస్తూ మూడింటిలో ఒక్క హిట్ అయినా కొడుతున్నాడు.. ఇటీవలే ఆయననుంచి వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా రాగా ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.. దాంతో ఆయన తదుపరి సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.. అయితే ఈలోపు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి వెళ్లడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది..

వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఒక తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో, తెలుగు సినిమా ని హిందీ లో రీమేక్ చేయడం ఏంటో అని కొంతమంది లాజిక్ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. పొట్ట కోటి కోటి తిప్పలు అన్నట్లు హిట్ కోసం కోటి వేషాలు.. బెల్లంకొండ కు టాలీవుడ్ లో వర్క్ అవుట్ అవ్వక బాలీవుడ్ కి వెళ్తున్నాడనే వార్తలు వస్తుండగా వీటిని తిప్పికొట్టాలంటే బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ తో భారీ హిట్ కొట్టాల్సిన వసరం ఎంతైనా ఉంది..

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ పెద్ద కుమారుడి కథ ఇలా ఉంటే చిన్న కుమారుడి సినిమా ఆదిలోనే ఆగిపోయింది.. నిర్మాత గా ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడి మొదటి సినిమా ని గట్టెంకించలేకపోయాడు.. దాంతో ఫ్రెష్ గా మరో రీమేక్ సినిమా తో చిన్న కుమారుడు గణేష్ ను లాంచ్ ని చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.. 2006లో షాహిద్ కపూర్, అమృతరావు ప్రధాన పాత్రలో నటించిన ‘వివాహ్’ అనే సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతుందట.. కృతి శెట్టి లక్కీ హ్యాండ్ కావడంతో గణేష్ తో నటించేందుకు ఆమె ఒప్పుకుంటే తొలి సినిమాతోనే హిట్ కొట్టడం గ్యారెంటీ..

మరింత సమాచారం తెలుసుకోండి: