మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం డిస్కో రాజా. ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన ప్రముఖ తమిళ నటుడు "బాబీ సింహ". ఈయన హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అయితే అనుకోకుండా తల్లితండ్రులు తమిళనాడు రాష్ట్రంలో కొడైకెనాల్ పరిసర ప్రాంతాలకు వలస వెళ్లడంతో , తమిళంలోనే నటుడిగా గుర్తింపు పొందాడు.


రేష్మి మీనన్ అనే హీరోయిన్ ని బాబీ సింహ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరో గా చేసిన హైదరాబాద్ లవ్ స్టోరీ అనే చిత్రంలో, అలాగే తెలుగులో హీరో సాయిరాం శంకర్ నటించిన నేనోరకం అనే చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీస్ డిజాస్టర్ కావడంతో  రేష్మి గురించి టాలీవుడ్ ఆడియెన్స్ కు  పెద్దగా తెలియదు.

అయితే ఇటీవల బాబీ సింహ ఒక ఇంటర్వ్యూలో రేష్మి తో తన బంధం ఎలా ఏర్పడిందో బాబీ సింహ మాట్లాడుతూ.." రేష్మి మీనన్ తో కలిసి ఓ సినిమాలో చేస్తున్నప్పుడు, ఆమెతో ప్రేమలో పడ్డాను.ఆ తరువాత రేష్మి మీనన్ కుటుంబ సభ్యులకు కూడా  నేను బాగా నచ్చడంతో రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాము. తన భార్య తనను బాగా అర్థం చేసుకోవడం వల్లే తన సినీ కెరియర్, కుటుంబ వ్యవహారం బాగా నడుస్తోందని"  బాబీ చెప్పుకొచ్చాడు.

తన కుటుంబంలో ఎవరికీ తన స్టార్డం. షూటింగ్ వివరాలు, అలాగే చిత్ర వివరాలు పెద్దగా తెలియవని, ఇలాంటి విషయాలు అసలు ఇంట్లో ఎవరితోను షేర్ చేసుకోను అని తెలిపాడు. కానీ  అప్పుడప్పుడు తన తల్లి మాత్రం ఫోన్ చేసి ఏదైనా సినిమాలో నటిస్తున్నావా? డబ్బులు ఏమైనా కావాలా ? అని అడిగేది అంటూ చెప్పుకొచ్చాడు బాబీ సింహ. కానీ ఈ మధ్యకాలంలో కుటుంబానికి తెలియకుండా ఒక స్టార్డంను అనుభవించడం అంటే అంత ఆషామాషీ కాదు. కానీ తన ప్రత్యేకతలను ఇంట్లో దాస్తూ, బయట ప్రపంచానికి తనేంటో నిరూపిస్తున్న బాబీ సింహకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: