యూత్ ఐకాన్ గా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ తన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డుపడకుండా ఉండి ఉంటే ఈమూవీ షూటింగ్ ఈపాటికే పూర్తి అయిపోయి ఉండేది. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోతో అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ విజయ్ ఆలోచనలు మటుకు ఓటీటీ పై ఉన్నాయి అంటున్నారు.

ప్రస్తుతం జనం ఓటీటీ లలో ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్ లను అదేవిధంగా రకరకాల షోలను చాల ఆసక్తిగా చూస్తున్నారు. దీనికితోడు ధియేటర్లు కూడ ఓపెన్ కాకపోవడంతో ఈ ఓటీటీ లు మినహా మరో వినోద మార్గం కనిపించడం లేదు. ఈ ట్రెండ్ ను తనకు అనుకూలంగా మార్చుకుని తన నేషనల్ వైడ్ ఇమేజ్ ని మరింత సుస్థిరం చేసుకోవాలని విజయ్ మాష్టర్ ప్లాన్ అని అంటున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కీలక చర్చలు జరుపుతున్నట్లుతెలుస్తోంది. యూత్ ను టార్గెట్ చేస్తూ ఒక టాక్ షోను కానీ లేదంటే ఒక వెబ్ సిరీస్ ను కానీ వీలైనంత త్వరలో నిర్మించాలని ఆ ఓటీటీ సంస్థ ప్లాన్ అని అంటున్నారు.

ఈ ఆలోచన విజయ్ కు కూడ నచ్చిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ క్రేజీ హీరో నటిస్తున్న ‘లైగర్’ మూవీ ఖచ్చితంగా ఈ సంవత్సరమే విడుదల అవుతుంది. దీనికి కొనసాగింపుగా తన పాన్ ఇండియా ఇమేజ్ నిలబెట్టుకోవడానికి ఈ వెబ్ సిరీస్ ప్రయత్నం అని టాక్. టాలీవుడ్ కు సంబంధించిన టాప్ యంగ్ హీరోలు అంతా పాన్ ఇండియా మూవీలలో నటిస్తున్నారు కానీ ఓటీటీ వెబ్ సిరీస్ లపై కన్ను వేయలేదు. దీనితో ముందుగా విజయ్ ఈ ఫీల్డ్ లో కూడ ఎంటర్ అయితే టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ మరింత నెక్ టు నెక్ గా మారే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: