వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణ  ఎలాగైనా హిట్టు సాధించాలని చెప్పి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాను చేస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా బాలకృష్ణ రేంజ్ లో ఓ అద్భుతమైన కథతో తెరకెక్కిందట. గతంలో బోయపాటి శ్రీనుతో రెండు సినిమాలు చేసిన బాలకృష్ణ అవి సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ సాధించడంతో అఖండ కూడా వాటి కంటే మించి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.

మాస్ సినిమా లకు కాదు పెట్టింది పేరుగా నిలిచిన బోయపాటి శ్రీను ఈ సినిమాలో తన గత సినిమాలకు మించి మాస్ ను ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారట. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ లు సినిమా ఎలా ఉండబోతున్నాయో అన్న దానికి మచ్చుతునకలు గా నిలిచాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూర్చగా సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. ముఖ్యంగా ఈ సినిమా లో భాగంగా వచ్చే ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సీన్ ఒక్కసారిగా ఈ సినిమా హైప్ ను క్రియేట్ చేయడంలో ఉపయోగపడుతుందట. బోయపాటి శ్రీను బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సీన్ డిజైన్ చేశాడట. ఇకపోతే బాలకృష్ణ మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఇంకా పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి ల దర్శకుల సినిమా లలో బాలకృష్ణ నటించబోతున్నాడు అని తెలుస్తుంది. ఒక సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచి మరో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్తున్న హీరోగా బాలకృష్ణ కూడా ఒకరి గా నిలిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: