తెలుగు బిబ్ బాస్ 3 ఇప్పుడు ఎంతో ఉత్కంఠంగా సాగుతుంది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నా ఒక్కొక్కరి మాస్క్ తీయమని చెప్పిన నాగార్జున వారి నిజస్వరూపాలు బయట పెట్టమన్నారు. బిగ్ బాస్ నాలుగు వారాలు ముగిసి ఐదో వారానికి చేరుకుంది.  ఇప్పటికలే నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిని ఎలిమినేట్ అయ్యారు.  ప్రస్తుతం ఎలిమినేషన్ గొల మొదలైంది..ఈ నేపథ్యంలో ఎవరు ఎవరిని ఎలిమినేషన్ చేయాలన్న రంగు పూసి వారు ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారన్న కారణాలు చెప్పాలని బిగ్ బాస్ తెలిపిపారు. 

గ‌త వారం రోహిణి ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌గా ప్ర‌స్తుతం 12 మంది స‌భ్యులు ఉన్నారు. అయితే అయితే అలీ కెప్టెన్ కావ‌డంతో ఆయ‌నకి న‌లుగురిని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవ‌కాశాన్ని ఇచ్చారు. అలీని ఎవరైతే మచ్చిక చేసుకుంటారో వారు సేఫ్ అవుతారు, ఒక్క‌రు నామినేట్ అవుతారు అని బిగ్ బాస్ తెలిపారు.  బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లను సూచించారు. దీంతో బాబా బాస్క‌ర్ .. అలీ మ‌న‌సు గెలుచుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు.  మరోవైపు రాహూల్ ని కూడా అందరూ టార్గెట్ చేసుకున్నారు.


ఇక అలీ కెప్టెన్ కాగా, ఆయ‌న చెప్పిన న‌లుగురిలో నామినేట్ కాని ఓ వ్య‌క్తిని ఎన్నుకోవాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో అలీ.. బాబా భాస్కర్‌‌ను నామినేట్ చేశారు.   అలీ త‌న‌ని నామినేష‌న్‌లో సీరియ‌స్‌గా ఉండ‌మ‌ని చెప్ప‌గా, అలాగే ఉన్నాను. అయిన‌ప్ప‌టికి న‌న్ను నామినేట్ చేయ‌డం బాగోలేదు అని చెబుతూ బాధపడ్డారు.


గ‌త వారం చేసిన చిన్న పొర‌పాటు వ‌ల‌న శివ‌జ్యోతి ఈ వారం డైరెక్ట్‌గా నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వారం రాహుల్ 8 మందితో నామినేట్ కావ‌డం విశేషం. బాబా భాస్క‌ర్ త‌న బాధ‌ని శ్రీముఖికి చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు.  ప్రస్తుతం ఐదో వారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: