నారా లోకేష్ ను కొన్ని రోజులుగా గమనిస్తున్నవారంతా.. ఆయన బాగా రాటు దేలారని చెబుతున్నారు. ఇంత చేస్తున్నా చినబాబుపై తమ్ముళ్లకు మాత్రం నమ్మకం లేనట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు తర్వాత టీడీపీని లోకేష్ నడపలేడనే భావనలోనే టీడీపీ మెజార్టీ కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు తాజాాగా కుప్పంలో జరిగిన ఘటనే ఉదాహరణ అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం టీడీపీకి కంచుకోట. నాలుగు దశాబ్దాలుగా కుప్పం నుంచి చంద్రబాబు గెలుస్తూ వస్తున్నాయి. ఆలాంటి చోటే... అది కూడా చంద్రబాబు పర్యటనలోనే జూనియర్ ఎన్టీఆర్ జపం వినిపించడం టీడీపీలో కాక రేపుతోంది. చంద్రబాబు ముందే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలంటూ కుప్పం తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ఫోటోలను ప్రదర్శించి.. ఆయనకు మద్దతుగా కేకలు వేశారు.
కుప్పం ఘటన తర్వాత రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70కి దగ్గరలో ఉంది. గతంలో లాగా ఆయన చురుకుగా తిరగలేకపోతున్నారు. కరోనా సమయంలో ఆయన బయటికి రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పైనే పార్టీ భారం పడింది. అయితే చంద్రబాబు తరహాలో టీడీపీని ముందుకు తీసుకెళ్లడం లోకేష్ వల్ల కాదని తమ్ముళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ఈ రకంగా చెప్పారంటున్నారు. దూకుడుగా వెళుతున్న జగన్ ను
ధీటుగా ఎదుర్కొవాలంటే జూనియర్ ఎన్టీఆరే.. సమర్ధుడని టీడీపీ నేతలు కూడా అఫ్ ది రికార్డుగా చెబుతున్నారని తెలుస్తోంది.