నియోజకవర్గాల్లో అనవసర రాజకీయాలు మొదలు పెట్టారు. దీనితో వర్గ విభేదాలు కూడా వైసీపీలో పెరిగిపోతున్నాయి. పార్టీ బలంగా ఉన్న సమయంలో ఇలాంటి వర్గ విభేదాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా బలంగా కనబడింది. చంద్రబాబు నాయుడు వ్యూహాలతో పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. అయితే పార్టీలో ఉన్న విభేదాల కారణంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి పాలైంది. పైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకోవడం స్థానికంగా ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలవాలి అనుకోవడం వంటివి జరిగాయి.
దీనితో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలి అనుకుంటూ స్థానికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి అని కోరుకునే పరిస్థితి వైసీపీ నేతలు తీసుకొస్తున్నారు. విభేదాల కారణంగా చాలామంది పార్టీ నేతలు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా మంత్రుల చాలా నియోజకవర్గాల్లో పెత్తనం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో దృష్టి పెడతారా లేదా అనేది చూడాలి.