మొత్తం 15 నిమిషాల నిడివు ఉండేలా ఏరియల్ డ్రోన్ షో ప్లాన్ చేశారు. ప్రత్యేకమైన కాన్సెప్ట్తో ఈ ఈవెంట్ను మరింత గ్రాండ్గా చేయాలని చూస్తున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో ఏకంగా 1,824 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం సృష్టించారు. ఒలింపిక్స్కు కబుకి చెకర్ చిహ్నాన్ని డ్రోన్లతో రూపొందించారు. రాముడి కథను, రామాయణ సమగ్ర యానిమేషన్ను డ్రోన్ ద్వారా ప్రదర్శించాలని యూపీ సర్కార్ భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శనను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. ప్రతి డ్రోన్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లతో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. మల్టీ రోటర్ విధానంతో... 400 మీటర్ల ఎత్తులో డ్రోన్ కెమెరాలతో ఈ మెగా ఈవెంట్ సాగనుంది. సమర్థవంతమైన, ఆకట్టుకునే మార్ఫింగ్ కోసం ఖచ్చితమైన జీపీఎస్ కలిగి ఉండేలా చూస్తున్నారు. డ్రోన్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం ప్రత్యేక బారికేడ్ ప్రాంతం ఏర్పాటు చేశారు. ఈ వేడుక కోసం యోగి ఆదిత్యానాథ్ సర్కార్ ఏకంగా 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.
మొత్తం 15 నిమిషాల నిడివు ఉండేలా ఏరియల్ డ్రోన్ షో ప్లాన్ చేశారు. ప్రత్యేకమైన కాన్సెప్ట్తో ఈ ఈవెంట్ను మరింత గ్రాండ్గా చేయాలని చూస్తున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో ఏకంగా 1,824 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం సృష్టించారు. ఒలింపిక్స్కు కబుకి చెకర్ చిహ్నాన్ని డ్రోన్లతో రూపొందించారు. రాముడి కథను, రామాయణ సమగ్ర యానిమేషన్ను డ్రోన్ ద్వారా ప్రదర్శించాలని యూపీ సర్కార్ భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శనను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. ప్రతి డ్రోన్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లతో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. మల్టీ రోటర్ విధానంతో... 400 మీటర్ల ఎత్తులో డ్రోన్ కెమెరాలతో ఈ మెగా ఈవెంట్ సాగనుంది. సమర్థవంతమైన, ఆకట్టుకునే మార్ఫింగ్ కోసం ఖచ్చితమైన జీపీఎస్ కలిగి ఉండేలా చూస్తున్నారు. డ్రోన్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం ప్రత్యేక బారికేడ్ ప్రాంతం ఏర్పాటు చేశారు. ఈ వేడుక కోసం యోగి ఆదిత్యానాథ్ సర్కార్ ఏకంగా 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.