అదేవిధంగా ఇవాళ సంబంధిత రుణాలు కానీ వడ్డీలు కానీ రుణం వడ్డీ కలిపి కానీ చెల్లించే క్రమంలో డిస్కంలు మోతాదుకు మించిన భారం మోస్తున్నాయి. కానీ ఇవేవీ పట్ట కుండా సర్దుబాటు ఛార్జీల పేరిట జగన్ ఏకపక్షంగా పోతున్నారని చంద్రబాబు మాట్లాడడం తగని పని అని సంబంధిత నిపుణులు అంటున్నారు. అదేవిధంగా కేంద్ర విద్యుత్ చట్టం - 2003 ను అతిక్రమిస్తూ బాబు తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇవాళ వినియోగదారులకు ఇంతటి భారం నెత్తిన పడిందన్న వాస్తవం ఒకటి అంతా గుర్తించాలి.
విపక్షాలు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే, పాలకపక్షాలు గణాంక సహితంగా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడలేనప్పుడు అబద్ధాలు ఒకటికి రెండు ప్రాచూర్యంలోకి వచ్చి, అవే నిజాలుగా చెలామణీ అవుతాయి అన్నది వాస్తవం. ఇదే లోక రీతి కూడా! లోక రీతికి భిన్నంగా ఏమయినా చేస్తే అప్పుడు అదొక మార్పు అవుతుంది. వైసీపీ స ర్కారు తరఫున మాట్లాడే మనుషులు చంద్రబాబు చెప్పే అబద్ధాలను నమ్మొద్దు అని చెబితే చాలదు. అవి ఎందుకు అబద్ధాలు ఏ విధంగా అవి వాస్తవ దూరాలు అన్నవి ని రూపణలోకి తెస్తేనే తగిన ఫలితం.