వైసీపీ ఆవిర్భవించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారిపోయింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. హస్తం పార్టీకి జై కొట్టడం టీడీపీ నేతలకు అదే తొలిసారి. దీనిపై అప్పట్లో సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఇదంతా కూడా వైఎస్ జగన్ పార్టీని అడ్డుకునేందుకు మాత్రమే అని అప్పట్లో తెలుగు తమ్ముళ్లు సర్ది చెప్పుకున్నారు కూడా. నాడు మొదలైనా టీడీపీ - వైసీపీ పోరు... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీ నేతల మధ్య ప్రస్తుతం ఉప్పు, నిప్పు మాదిరి తయారైంది పరిస్థితి. చివరికి టీడీపీ అధినేతపై వ్యాఖ్యలు చేసేందుకు ఎంత వరకైనా సరే వెనుకాడేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. ఇంకా చెప్పాలంటే గతంలో వైసీపీ నేతలను టీడీపీ ఎలా టార్గెట్ చేసిందో...సేమ్ అలానే ఇప్పుడు టీడీపీ నేతలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. దీంతో చంద్రబాబు, జగన్ మధ్య పోరు రోజు రోజుకూ మరింత తీవ్ర రూపం దాలుస్తోంది.
వైసీపీ ఆవిర్భవించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారిపోయింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. హస్తం పార్టీకి జై కొట్టడం టీడీపీ నేతలకు అదే తొలిసారి. దీనిపై అప్పట్లో సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఇదంతా కూడా వైఎస్ జగన్ పార్టీని అడ్డుకునేందుకు మాత్రమే అని అప్పట్లో తెలుగు తమ్ముళ్లు సర్ది చెప్పుకున్నారు కూడా. నాడు మొదలైనా టీడీపీ - వైసీపీ పోరు... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీ నేతల మధ్య ప్రస్తుతం ఉప్పు, నిప్పు మాదిరి తయారైంది పరిస్థితి. చివరికి టీడీపీ అధినేతపై వ్యాఖ్యలు చేసేందుకు ఎంత వరకైనా సరే వెనుకాడేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. ఇంకా చెప్పాలంటే గతంలో వైసీపీ నేతలను టీడీపీ ఎలా టార్గెట్ చేసిందో...సేమ్ అలానే ఇప్పుడు టీడీపీ నేతలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. దీంతో చంద్రబాబు, జగన్ మధ్య పోరు రోజు రోజుకూ మరింత తీవ్ర రూపం దాలుస్తోంది.