మళ్లీ పట్టాభిలాంటి స్టంట్ ఒకటి ప్లే చేయాలని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే దూషణ అన్నది రాజ్య ద్రోహం కాదు అని తేలిపోయిం ది కనుక దేశ బహిష్కరణ లాంటి చర్యలు సంఘ బహిష్కరణ లాంటి చర్యలు చేపట్టేందుకు అస్సలు ఆస్కారమే లేదు అని కోర్టులే చె ప్పేశాయి కనుక ఎలా అయినా ఈ సారి ఊరు దాటి పోయేందుకు సిద్ధమై నాలుగు తిట్లు తిట్టి మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకుని అటుపై అధినేత దగ్గరా మార్కులు కొట్టేసి ఫ్లైట్ ఎక్కి పోదాన్నది కొందరి టీడీపీ నాయకుల ప్లాన్.
మరోవైపు వైసీపీ మాత్రం తిట్లు తిని వాటి ద్వారా ఎంతో కొంత సానుభూతి పొందాలని, టీడీపీ తిట్లకు కొత్త అర్థాలేవో వెతుకుతోంది.
ఇందుకు మొన్నటి వేళ పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా జగన్ మాట్లాడిన మాటలు కొందరి నేతలకు ప్రేరణ ఇచ్చాయి. అంతేకాదు ఎన్నడూ సౌమ్యంగా ఉంటే నేతలు కూడా తమకు మైలేజ్ రావాలంటే, అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలంటే, పదవులు కొట్టేయాలంటే తిట్లు తిట్టే సంప్రదాయం మనం ఎందుకు అలవర్చుకోకూడదు అన్న ఆలోచనలో కూడా ఉన్నారు.