తాజాగా టీడీపీ నుంచి కొందరు నాయకులు కొత్త తిట్ల దండకం ఒకటి అందుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ తిట్ల స్థాయి ఎలా ఉంటుందో అని చాలా మంది భయపడిపోతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఉద్రిక్త వాతావరణం ఒకటి నెలకొని ఉంది. అది నివురు గప్పిన నిప్పులా ఉంది. టీడీపీ ని తిట్టేందుకు స్పీకర్ సీతారాం కూడా వెనక్కు తగ్గరు. దువ్వాడ శ్రీను అనే ఎంఎల్సీ కూడా తగ్గరు. ఇంకా రాయలసీమలో అయితే స్వామి భక్తులకు కరువే లేదు. ఇప్పుడు వీళ్లంతా తిట్టి ఏం సాధిస్తారు. వీళ్లకు బాక్సింగ్ నేర్పండి అని సెటైర్ వేశాడు ఆర్జీవీ.
రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు కానీ తిట్లు మాత్రం శాశ్వతమే. గతంలోనూ ఇలాంటి పరిణామాలే ఉన్నాయి. ఇందిరా గాంధీ పాలన సమయంలో కూడా ఇంతటి తీవ్ర స్థాయిలోనే అరుణ్ శౌరి లాంటి సీనియర్ జర్నలిస్టులు పదాలను ఉపయోగించార ని అప్పటి మనుషులు చెబుతున్న మాట. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా కనుక వారు ఏ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడారు వీరు ఏ ఉద్దేశాలను ఆపాదించుకుని మాట్లాడుతున్నారు అన్నది గమనించదగ్గ విషయాలు. ఏదేమైనప్పటికీ పట్టాభి తిట్లకు డిక్షనరీ అర్థాలు వెతుక్కోవడం అన్నదే పెద్ద జోక్. అనవసరంగా ఆయనను పెద్దాడ్ని చేశారు కదా!