నియోజకవర్గ కేంద్రమైన హుజూరాబాద్, జమ్మికుంటలతో పాటు మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు మండలాలు మున్సిపాల్టీలు కూడా. దీంతో పాటు వీణవంక మండలం కూడా అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయించడంలో కీలకం కానుంది. ముందుగా ఇక్కడ ప్రచారానికి రావాలని సీఎం కేసీఆర్ అనుకున్నారు. ఇక ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఇక లేనట్టే అని అర్థమవుతోంది.
హుజురాబాద్ టీఆర్ ఎస్ గెలుపు ఆశలు అన్నీ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి మంత్రి హరీశ్రావు పైనే ఉన్నాయి. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకు ఆయన బాగా కష్టపడుతూ కృషి చేస్తున్నారు. ఇక బీజేపీ చివరి రెండు రోజుల్లో రోడ్ షోలే చేయాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కీలక నేతలు కేంద్రమంత్రి కిషన్రెడ్డి - రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ - సినీ నటి విజయశాంతి - డీకే అరుణ - ఎమ్మెల్యే రఘునందన్రావు, ఎంపీ అర్వింద్ ప్రచారంలో ఉన్నారు.
ఇక టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరపున చివరి రోజు ప్రచారానికి వస్తున్నారు.